114 శాతం లాభంతో లిస్టింగ్
139 శాతం లాభంతో ముగింపు
న్యూఢిల్లీ: క్రాఫ్ట్ కాగితం తయారు చేసే ఆస్ట్రన్ పేపర్ అండ్ బోర్డ్ మిల్స్ షేర్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర రూ.50తో పోలిస్తే రెట్టింపునకు పైగా ధరతో రూ.114 వద్ద బీఎస్ఈలో లిస్టయింది. ఇంట్రాడేలో 139 శాతం లాభంతో రూ.120 గరిష్ట స్థాయికి (ఇది అప్పర్ సర్క్యూట్ ) చేరింది.
ఇదే ధర వద్ద ముగిసింది. బీఎస్ఈలో 5.67 లక్షలు, ఎన్ఎస్ఈలో 62 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ నెల 15–20 మధ్య వచ్చిన ఈ రూ.70 కోట్ల ఐపీఓ 243 రెట్లు ఓవర్ సబ్స్క్రైబయింది.