పీఎన్‌బీ పండుగ శుభవార్త!

31 Aug, 2017 13:26 IST|Sakshi
పీఎన్‌బీ పండుగ శుభవార్త!

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త అందించింది. రానున్న దసరా దీపావళి సందర్భంగా కస్టర్లకు  రుణాలపై  తక్కువ వడ్డీరేట్ల ఆఫర్‌ను ప్రకటించింది.   రుణాల వడ్డీరేటులో (ఎంసీఎల్‌ఆర్‌) కోత పెట్టింది. 20-25 బేసిస్‌పాయింట్లను తగ్గిస్తున్నట్టు గురువారం వెల్లడించింది. ఈ తగ్గింపురేట్లు సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. 

తాజా నిర్ణయం ప్రకారం పీఎన్‌బీ ప్రస్తుత బేస్ వడ్డీరేటు 9.15శాతంగా ఉండనుంది. ఇప్పటివరకు ఇది  9.35 శాతం.  వార్షిక  ఎంసీఎల్‌ఆర్‌  8.15 శాతంగాను, మూడు నెలల కాలానికి  8 శాతంగా ఉంది.

 

మరిన్ని వార్తలు