పీఎన్‌బీ స్కాం: రూ. 255కోట్ల హాంకాంగ్‌ ఆస్తులు ఎటాచ్‌

25 Oct, 2018 18:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)ను13వేల కోట్ల రూపాయలకు మోసం చేసి విదేశాలకు  పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరిన్నిఆస్తులను ఎటాచ్‌ చేసింది. హాంకాంగ్‌కు చెందిన  రూ. 255 కోట్ల విలువైన ఆస్తులను  ఈడీఎటాచ్‌ చేసింది.మనీ లాండరింగ్‌  చట్టం కింద  ఈడీ ఈ చర్య తీసుకుంది.  దీంతో మొత్తం ఎటాచ్‌ చేసిన ఆస్తుల విలువ  రూ. 4,744కోట్లకు చేరింది.

మరిన్ని వార్తలు