భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

7 Dec, 2017 15:42 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు అన్ని సెక్టార్లు లాభాలనార్జించాయి. దీంతో రెండు రోజుల నష్టాలకు చెక్‌ చెప్పిన సెన్సెక్స్‌ 352 పాయింట్ల లాభంతో 32,949 వద్ద నిఫ్టీ123 పాయింట్ల లాభంతో 10,150వద్ద ముగిశాయి.

ముఖ్యంగా వరుస నాలుగు సెషన్లుగా నష్టపోతున్న రియల్టీ సెక్టార్‌ రీబౌండ్‌ అయింది. టెలికాం, మెటల్‌ పాజిటివ్‌గా ముగియగా... ఫార్మా, ఐటీ సెక్టార్‌ బలహీన పడింది. గెయిల్‌, భారతి ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్ర, టాటా పవర్‌, ఐడియా, యూపీఎల్‌, మారుతి సుజుకి, టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. అలాగే కోల్‌ ఇండియా, సిప్లా గోద్రెజ్‌ కన్జ్యూమర్‌, విప్రో, టీసీఎస్‌, గ్లెన్‌మార్క్‌, సన్‌ ఫార్మా, డా.రెడ్డీస్‌ తదితర షేర్లు నష్టపోయాయి.

మరిన్ని వార్తలు