భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

11 Jul, 2016 09:54 IST|Sakshi

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన మార్కెట్లు కూడా జోష్తో ఆరంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ అదరగొట్టింది. సెన్సెక్స్ 400 పాయింట్లలో ట్రేడింగ్ ప్రారంభించగా 27,590.99 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా 8,400 పాయింట్ల మార్క్ దాటింది. ఇక రూపాయి కూడా 26 పైసల మేరకు లాభపడింది. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.67.11గా ఉంది.

 

మరిన్ని వార్తలు