ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల జోరు రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 375 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో మన స్టాక్ మార్కెట్ కూడా లాభాలతో ఆరంభమైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 24,098.79 వద్ద, నిఫ్టీ 7,320.90 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు రూపాయి కూడా 11 పైసల మేరకు బలపడింది. రూపాయితో పోల్చితే డాలర్ విలువ ప్రస్తుతం 67.74 ఉంది.