అక్రమ సంబంధం.. కుమార్తె హత్య

29 Dec, 2017 19:44 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో రెండేళ్ల కుమార్తెను కర్కశంగా హత్య చేసిం‍దో తల్లి. బెంగళూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెబుతున్న వివరాలివి. 

బెంగళూరులోని అవడదెనహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న నివేదితకు వివాహం మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ క్రమంలో వారికి రెండేళ్ల కిందట అన్నపూర్ణ అనే పాప కూడా పుట్టింది. సంసారం బాగా సాగుతున్న దశలో నివేదితకు సమీప బంధువు అయిన సతీష్‌తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం చనువుగా మారి.. ఆపై అక్రమసంబంధానికి దారి తీసింది. అక్రమ సంబంధాన్ని సక్రమంగా మార్చుకోవాలన్న ఆలోచనతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే భర్త విడాకులు ఇవ్వడన్న కారణంతో.. ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకున్నారు. ఇందుకు రెండేళ్ల కుమార్తెను అడ్డుగా వస్తోందని ఇద్దరూ భావించారు.

ఈ నేపథ్యంలో చిన్నారిని హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని నివేదిత, సతీష్‌ భావించారు. అనుకోకుండా.. రెండు రోజుల కిందట అనారోగ్యంతో రెండేళ్ల అన్నపూర్ణను తండ్రి ఆసుపత్రిలో చేర్చారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని.. ఎవరూ లేని సమయంలో చిన్నారిని ఆసుపత్రిని బయటకు తీసుకెళ్లి.. నివేదిత, ఆమె ప్రియుడు హత్య చేశారు. కుటుంబ సభ్యులతో మాత్రం చిన్నారిని ఎవరో కిడ్నాప్‌ చేశారని చెప్పారు. 

దీనిపై అన్నపూర్ణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా.. నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని తమ శైలిలో విచారణ చేయగా నిజాలు అన్నీ చెప్పారు. 

మరిన్ని వార్తలు