మైనర్‌ బాలికపై పూజారి అఘాయిత్యం

27 Dec, 2019 12:27 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది. పూజారిగా వృత్తి నిర్వహిస్తున్న మహేందర్‌(23) స్థానికంగా 8వ తరగతి చదువుతున్న బాలికతో  ఏడాదిగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. అంతేగాక ఇద్దరు సన్నిహితంగా ఉ‍న్న ఫోటోలను లోకల్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై  స్పందించిన మిరుదొడ్డి పోలీసులు నిందితునిపై పోక్సో యాక్ట్‌ కింద పలు కేసులు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు