విషాదం: భార్యాభర్తల ఆత్మహత్య

26 Sep, 2017 17:58 IST|Sakshi

సాక్షి, యాదాద్రి:  దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట యాదవ్‌ నగర్‌లో నివసిస్తున్న మల్లపూరానికి చెందిన బొంత వెంకటేష్‌(28), అతని భార్య మహేశ్వరి(25)లు తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు