మద్యం మత్తులో కారుతో సీఐ హల్‌చల్!

29 Jan, 2018 22:45 IST|Sakshi
ప్రమాద స్థలంలో కారు

సాక్షి, మేడ్చల్: మద్యం మత్తులో ఓ సీఐ తన కారుతో హల్ చల్ చేశాడు. యప్రాల్ హనుమాన్ టెంపుల్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు.టెంపుల్ పక్కనున్న బైక్‌లు, ఆటోలపైకి సీఐ గిరీష్ కుమార్ విచక్షణా రహితంగా తన కారును నడుపుతూ దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు దంపతులకు కాళ్లు విరిగాయి. స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సీఐ గిరీష్ కుమార్ మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదానికి కారణం కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పందించారు. సీఐ గిరీష్‌కుమార్‌పై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

మరిన్ని వార్తలు