వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

30 Jul, 2019 12:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్‌ చేశారని, ఆయనకు తెలిసిన వారే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గజేంద్ర మిత్రుడే ఈ కిడ్నాప్‌ ముఠాకు నాయకుడిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. గజేంద్ర కోట్లల్లో వ్యాపారం చేస్తుంటాడని, ఆయనను కిడ్నాప్‌ చేయడం ద్వారా కోట్ల రూపాయలు రాబట్టవచ్చునని గజేంద్ర స్నేహితుడు అల్మా అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు స్కెచ్ వేశాడని, మరో ఇద్దరితో అతను కలిసి గజేంద్రను కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. డబ్బులు తీసుకొని గజేంద్రను అల్మా గ్యాంగ్ ఇప్పటికే విడిచిపెట్టింది. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు