జర్నలిస్ట్‌ గొంతుకోసి కిరాతకంగా..

10 Oct, 2019 18:31 IST|Sakshi

లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఖుషీనగర్‌లోని దుబోలి గ్రామ సమీపంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ రాధేశ్యాం శర్మ (55)ను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. శర్మ గొంతు కోసిన దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. బాధిత జర్నలిస్ట్‌ బైక్‌పై వెళుతుండగా అడ్డగించిన దుండగులు ఆయనను దారుణంగా హతమార్చారు. స్ధానిక హిందీ పత్రికలో పనిచేసే జర్నలిస్ట్‌ ఖుషీనగర్‌ జిల్లాలోని తమ గ్రామంలో ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గానూ సేవలందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని జర్నలిస్ట్‌ హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు