మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి..

9 Feb, 2020 15:14 IST|Sakshi

సాక్షి, చేవేళ్ల: చేవెళ్ల బస్‌స్టాండ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కడానికి ప్రయత్నించిన యువకుడు అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడిపోయాడు. మెల్లగా కదులుతున్న బస్సు ఎక్కబోయి చక్రాల కిందపడి పోయాడు. దాంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అధిక రద్దీ  కారణంగా మైనర్‌ బాలుడు చనిపోయాడని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. అయితే రద్దీగా ఉన్న బస్సులను ఎక్కవద్దని, బస్సు ఫుట్‌బోర్డు పై నిలబడొద్దని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు విద్యార్థులకు, ప్రజలకు సూచించారు. 

మరిన్ని వార్తలు