తెలివిగా స్మగ్లింగ్ చేసినా అడ్డంగా బుక్కయ్యాడు!

31 Jan, 2018 21:43 IST|Sakshi

సాక్షి, చెన్నై: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో అతడి వద్ద బంగారం లభించడంతో పోలీసులు షాకయ్యారు. సయీద్ రఫీ అనే వ్యక్తి బుధవారం జెడ్డా నుండి కువైట్ ఎయిర్‌లైన్స్ లో చెన్నైకి వచ్చాడు. అయితే అతడి కదలికలపై అనుమానం వచ్చిన డీఆర్ఐ అధికారులు రఫీ లగేజీ చెక్ చేయగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. బంగారు బిస్కెట్లను ఖర్జూర ప్యాకెట్లలో దాచి విదేశాల నుంచి అక్రమ రవాణా చేస్తున్నట్లు అధికారులు గమనించారు. నాలుగు కేజీల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారం విలువ దాదాపు కోటిన్నర రూపాయలు ఉండొచ్చునని అంచనా వేశారు.

మరిన్ని వార్తలు