శావల్యాపురంలో వ్యక్తి దారుణ హత్య

15 Aug, 2018 16:00 IST|Sakshi
మృతదేహం వద్ద ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

గుంటూరు జిల్లా: శావల్యాపురం మండలకేంద్రంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఘంటా ప్రసాద్‌(36) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరిస్తోన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు