సౌదీ విమానానికి తప్పిన ముప్పు

7 Aug, 2018 08:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్‌: సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానానికి మంగళవారం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి సౌదీ అరేబియా వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. ఈ విషయం గమనించిన పైలట్‌లు వెంటనే చాకచక్యంగా ల్యాండింగ్‌ చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో 70 మంది ప్రయాణం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు