ర్యాష్‌ డ్రైవింగ్‌.. విదేశీయురాలి మృతి!

19 Feb, 2019 13:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త పాంటీ చద్దా బంధువు అసీస్‌ సింగ్‌ చద్దా ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తూ.. ఓ విదేశీయురాలి మృతికి కారణమయ్యాడు. వినయ మార్గ్‌లో అతి వేగంగా వస్తున్న కారు.. ఆటోను డీకొట్టిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో.. ఆటోలో ప్రయాణిస్తున్న తుర్క్‌మెనిస్తాన్‌కు చెందిన మహిళల్లో ఒకరు మృతి చెందగా, మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అసీస్‌ సింగ్‌ చద్దాను అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించలేదనీ, అతడి వద్ద డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా ఉందనీ తెలిపారు. అతనిపై ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు