టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి

16 Apr, 2019 07:32 IST|Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు