టీచర్‌ హత్యకేసు.. నిందితుడి ఆత్మహత్య

25 Feb, 2019 07:33 IST|Sakshi

టీ.నగర్‌ : ఉపాధ్యాయినిని హతమార్చిన యువకుడు ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. కడలూరు జిల్లా, కురింజిపాడికి చెందిన రమ్య మెట్రిక్యులేషన్‌ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తోంది. రాజశేఖర్‌ (23) అనే యువకుడు రమ్యకు ప్రేమ విషయాన్ని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో  కురించిపాడి పాఠశాలకు వెళ్లి అక్కడ పనిచేసే రమ్య గొంతుకోసి పరారయ్యాడు. దీనిపై ప్రత్యేక పోలీసు బృందం పోలీసులు రాజశేఖర్‌ సొంత ఊరైన విరుత్తగిరికుప్పం వెళ్లి విచారణ చేశారు.

రాజశేఖర్‌ సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా అతను దాగి ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి రాజశేఖర్‌ తండ్రి అరంగన్నాల్‌ను తమ వెంట తీసుకువెళ్లారు. ఇలా ఉండగా ఉళుందూరుపేట సమీపంలోని తొప్పులాన్‌కుళం జీడితోపులో ఆదివారం రాజేశేఖర్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి రాజశేఖరన్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు