దీపావళి షాపింగ్‌కు తీసుకెళ్ల లేదని..

9 Nov, 2018 08:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచోసుకుంది. దీపావళి షాపింగ్‌కు తీసుకెళ్లలేదనే కోపంతో పక్కింటి వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు ఓ టీనేజర్‌. ఈ ఘోరం గురువారం రాత్రి 11.40 సమయంలో నార్త్‌వెస్ట్‌ ఢిల్లీ, జహంగీర్‌పురిలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి వెళ్లేలోపే మృతుడు దీపక్‌ తీవ్రంగా గాయపడ్డాడని, హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతను మరణించాడని పోలీసులు పేర్కొన్నారు.

బుధవారం దీపావళి షాపింగ్‌కు దీపక్‌ తన బైక్‌పై ఎక్కించుకోలేదని నిందితుడు యోగేష్‌ (19) గొడవపడ్డాడని, అనంతరం ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందని తెలిపారు. కానీ యోగేశ్‌ మాత్రం పగతో దీపక్‌ను చంపాలని భావించడాని, అదును కోసం వేచి చూసి చంపేశాడని పేర్కొన్నారు. యోగేష్‌ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు.

మరిన్ని వార్తలు