మహిళను బంధించి దోపిడీ 

12 Jul, 2018 14:30 IST|Sakshi
 చోరీ స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్‌రావు 

మండల కేంద్రంలో చోరీ

మూడు తులాల బంగారం, రూ.3.80లక్షలు అపహరణ 

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలోని బాన్స్‌వాడ రహదారిలో గల దాసరి రవి ఇంట్లో దుండగులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన దాసరి రవి బాన్స్‌వాడ రహదారిలో సిమెంట్‌ పైపులు తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన భార్యతో కలిసి సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి వెళ్లాడు. కాగా ఇంటి వద్ద అతడి అత్త సాయవ్వ ఉంది.

రాత్రి 1.30 గంటల సమయంలో దుండగులు వచ్చి సాయవ్వను బంధించి ఇంట్లోని 3 తులాల బంగారం, రూ.3.80 లక్షల నగదు ఎత్తుకెల్లినట్లు బాధితులు తెలిపారు. ఇంట్లో సాయవ్వ ఒక్కరే ఉండటం చూసి ఈ చోరీ చేసి ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు. దాసరి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్స్‌వాడ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు