నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.700 కోట్ల మోసం

7 Oct, 2019 05:38 IST|Sakshi

పుణె: నకిలీ జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) ఇన్‌వాయిస్‌లతో భారీ మోసానికి పాల్పడిన ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ కేసుకు సంబంధించి పుణెలో ఇద్దరు అరెస్టయ్యారు. పుణె నగరానికి చెందిన రిలయబుల్‌ మల్టీట్రేడింగ్, హిమాలయా ట్రేడ్‌లింక్స్‌ సంస్థలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) క్లెయిమ్‌ చేసుకునేందుకు రూ.700 కోట్ల విలువ చేసే నకిలీ జీఎస్‌టీ ఇన్‌వాయిస్‌లు జారీ చేసినట్లు కేంద్రీయ వస్తు, సేవల పన్నుల (సీజీఎస్‌టీ) విభాగం గుర్తించింది. 

మరిన్ని వార్తలు