యువకుడి దారుణ హత్య

21 Oct, 2018 13:14 IST|Sakshi
ఘటనా స్థలంలో శేఖర్‌ మృతదేహం అగీశేఖర్‌ (ఫైల్‌)

షాద్‌నగర్‌రూరల్‌: యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం ఉదయం ఫరూక్‌నగర్‌లోని గుండుగేరిలో వెలుగు చూసింది. ఫరూఖ్‌నగర్‌కు చెందిన శేఖర్‌(25)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా గొంతు కోసి హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు హత్య విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీధర్‌లు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు.

హత్య ఏవిధంగా జరిగింది? హత్య ఎవరు చేశారన్న విషయం ఇంకా తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. శేఖర్‌ ప్లంబర్‌ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలుసుకుని జనం పెద్ద ఎత్తున ఘటనా స్ధలానికి తరలివచ్చారు. 

మరిన్ని వార్తలు