కర్నూలుకు 193 బ్యాలెట్‌ బాక్సులు

3 Mar, 2017 00:03 IST|Sakshi
కర్నూలుకు 193 బ్యాలెట్‌ బాక్సులు
కర్నూలు సీక్యాంప్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9వతేదీన జరిగే పోలింగ్‌కు అవసరమైన 193 బ్యాలెట్‌ బాక్సులు గురువారం ఆదోని నుంచి కర్నూలు చేరాయి.  కర్నూలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వీటిని కార్యాలయ సిబ్బంది పరిశీలించారు. పోలింగ్‌ నిర్వహణకు సంబంధించి రెండు రోజుల్లో పూర్తి ఏర్పాట్లు చేస్తామని కర్నూలు తహసీల్దార్‌ టీవీ రమేష్‌బాబు తెలిపారు. బ్యాలెట్‌ బాక్స్‌లు పూర్తిగా పాతవి కావడంతో వాటిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పాడైపోయిన వాటిని మళ్లీ రిటర్నింగ్‌ అధికారులకు అప్పజెబుతామన్నారు.
 
మరిన్ని వార్తలు