నీటిసంపులో పడి చిన్నారి దుర్మరణం

12 Jun, 2016 17:46 IST|Sakshi

గరిడేపల్లి (నల్లగొండ) : అప్పటి వరకూ ఇంటి ముందు ఆడుకున్న ఆ చిన్నారిని నీటి సంపు బలితీసుకుంది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా సమీరా(3) అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. చిన్నారి మాట వినిపించకపోవడంతో కొంతసేపటి తర్వాత తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా పాప కనిపించలేదు. చుట్టూ వెతగ్గా నీటి సంపులో పడి మృతి చెంది కనిపించింది.

>
మరిన్ని వార్తలు