అనంతపురం అగ్రికల్చర్: పట్టుపరిశ్రమశాఖలో శనివారం జిల్లా స్థాయిలో సాధారణ బదిలీలకు సంబంధించి అర్హులైన ఉద్యోగులకు జేడీ అరుణకుమారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి వారిచ్చిన ఆప్షన్ల మేరకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. టెక్నికల్ ఆఫీసర్స్ 13 మంది, టెక్నికల్ అసిస్టెంట్స్ ఏడుగురు, ఆఫీస్ సబార్డినేట్స్ ఏడుగురు, డ్రైవర్లు ముగ్గురు బదిలీ అయ్యారు.