రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

12 Jan, 2017 22:30 IST|Sakshi
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
 
 
నరసరావుపేటటౌన్ : రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వేపోలీసుల కథనం ప్రకారం రైల్వేఫ్లాట్‌ఫాం–1 మరుగుదొడ్ల వద్ద గల రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న ౖరైల్వే ఎస్‌ఐ సత్యన్నారాయణ, హెడ్‌కానిస్టేబుల్‌ పీరాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తెల్లవారుజామున రైలుకింద పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి ఉండి 5.2అడుగుల ఎత్తు ఉన్నాడు. ఒంటిపై పాచిరంగు మోకాళ్ళవరకు చినిగిన జీన్స్‌పాంట్‌ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియావైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్ళు తెలిసినవారు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
 
మరిన్ని వార్తలు