నాడు వీఆర్వో.. నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారి!

19 May, 2016 13:47 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మాజీ వీఆర్‌వో బెహరా సీతారామయ్య ఇంటిపై గురువారం ఉదయం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 22 లక్షల రూపాయల నగదు, ప్రామిసరీ నోట్లు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, భారీ ఎత్తున బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


గతంలో వీఆవ్వోగా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీతారామయ్య ప్రస్తుతం రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇబ్రహీంపట్నంలో డాక్యుమెంట్  రైటర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీసీపీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు.

మరిన్ని వార్తలు