దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

23 Aug, 2016 09:30 IST|Sakshi

విజయవాడ: నగరంలోని కనకదుర్గ అమ్మవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చినరాజప్పకు దేవస్థానం ఈవో స్వాగతం పలికారు. అనంతరం బెంజిసర్కిల్‌లో జరుగుతున్న విశ్వశాంతి ఉద్గీద మహామృత్యుంజయ హోమం కార్యక్రమంలో చినరాజప్ప దంపతులు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు.
 

మరిన్ని వార్తలు