అత్యాచార నిందితులకు రిమాండ్

7 Oct, 2016 17:27 IST|Sakshi

మెదక్: మోసపూరిత మాటలతో ఇంటి వద్ద దిగబెడతామని నమ్మించి బైక్ పై మహిళను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన ఓ మహిళ(30)పై బాలేష్, నగేష్ అనే ఇద్దరు యువకులు బుధవారం రాత్రి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని మహిళ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని వార్తలు