శ్రీకాకుళం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 11 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓ వ్యక్తి మృతి చెందగా మరో 11మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.