విజయనగరం ఫోర్ట్: ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబే దోషి అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. విజయనగరంలోని బాలాజీ నగర్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ ఎంత త్వరగా నివేదిక ఇస్తే అంత త్వరగా చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.