వర్షానికి కూలిన ఇళ్లు

1 Aug, 2016 17:44 IST|Sakshi
వర్షానికి కూలిన ఇళ్లు

పెద్దేముల్‌: వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోతున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పెద్దేముల్‌ మండల జైరాం తండాలో రూప్‌సింగ్‌నాయక్‌, కిషన్‌నాయక్‌కు చెందిన రెండు ఇళ్లతోపాటు పెద్దేముల్‌ గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ విషయాన్ని ఆయా గ్రామాల రెవెన్యూ కార్యదర్శులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వర్షాలకు కులిన ఇళ్లకు ప్రభుత్వం పరిహారంతో పాటు కొత్త ఇళ్లు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చుస్తానని ఓంలానాయక్‌తండా ఎంపీటీసీ సభ్యుడు గెమ్యానాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు