కోడుమూరు రూరల్ : పట్టణ సమీపంలోని కర్నూలు రోడ్డులో మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సిబ్బంది జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పొలాల్లో పూడ్చిపెట్టారు.