జనావాసాల్లో జింక

6 Jan, 2016 09:11 IST|Sakshi

నల్లగొండ: నూతన భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి జింకకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలోని తిరుమల థియేటర్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. సమీపంలోని లతీఫ్ షావలి గుట్టపై సంచరిస్తున్న జింకను కుక్కలు తరమడంతో.. జనావాసాల్లోకి వచ్చి ప్రమాదవశాత్తు గుంతలో పడింది. ఇది గుర్తించిన స్థానికులు టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గుంటలో పడిన జింకను రక్షించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

మరిన్ని వార్తలు