మిర్యాలగూడలో భ్రూణహత్యలు!

4 Aug, 2016 09:29 IST|Sakshi

మిర్యాలగూడ అర్బన్(నల్గొండ జిల్లా): మిర్యాలగూడ మండలంలోని ఎన్‌ఎస్‌పీ గెస్ట్‌హౌస్ ముందు మూడు మానవపిండాలు లభ్యమయ్యాయి. వీటిని ఒకే కవర్లో పెట్టి అక్కడ పడేసి వెళ్లడం కలకలం సృష్టించింది. స్థానికులు గమనించి ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. భ్రూణహత్యలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. కవర్‌పై ‘శ్వేత నర్సింగ్ హోమ్’ అనే పేరు ఉంది. సంఘటనాస్థలాన్ని సీఐ పాండు రంగా రెడ్డి, వైద్యాధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు