కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు! మంగళవారం నాడు వారణాసి రోడ్డుషోలో పాల్గొన్న తర్వాత మధ్యలోనే వెనుదిరిగిన సోనియా ప్రస్తుతం న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్జీహెచ్కి తరలించారు. ఇమె ఇప్పటికీ డీహైడ్రేషన్, ఎలక్ట్రొలైట్ల అసమతౌల్యంతో బాధపడుతున్నారు.
వారణాసి ర్యాలీలో పాల్గొన్న సమయంలో సోనియాగాంధీ పడిపోవడంతో ఆమె మోచేయి కూడా విరిగినట్లు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆమెను సర్ గంగారాం ఆస్పత్రికి తీసుకొచ్చారని, పల్మనాలజిస్టు డాక్టర్ అరూప్ బసు, ఆయన బృందం ఆమెకు చికిత్స చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు.
అయితే, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సోనియాగాంధీ ఈ వారంలో మాత్రం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో ఆమెను వారణాసి నుంచి ఢిల్లీకి తరలించినప్పటి కంటే ఇప్పుడు ఆమె పరిస్థితి చాలా మెరుగుపడిందని, ఆర్మీ ఆస్పత్రికి తీసుకొచ్చేసరికి ఆమె బాగా మత్తుగా ఉన్నారని.. అసలు మాట కూడా రాలేదని తెలిసింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా సోనియా వెంటే ఉంటున్నారు. అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఆస్పత్రికి వచ్చి అత్తను పలకరించి వెళ్లారు.
ఐసీయూలో సోనియా గాంధీ!
Published Thu, Aug 4 2016 8:11 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement