కర్నూలు(రాజ్విహార్): పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సాహిస్తామని, సమస్యలుంటే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు పరిశ్రమల శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. రాజేంద్ర తెలిపారు. శనివారం స్థానిక ఐలా అసోసియేషన్ భవనంలో వివిధ పారిశ్రామికవేత్తలు, సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఏర్పాటైన, కొత్తగా నెలకొల్పుతున్న పరిశ్రమల స్థితిగతులు తెలుసుకునేందుకు కార్యచరణ రూపొందించామన్నారు. అనుమతులు పొందడం, ఇతర టెక్నికల్ కారణాల సమస్యలు ఎదురైతే తన దష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ఫ్యాప్సీయా అధ్యక్షుడు జిఆర్కె రెడ్డి, కార్యదర్శి ఎం జగన్మోహన్రెడ్డి, జనరల్ మేనేజరు సోమశేఖర్రెడ్డి, మధుసూదన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.