28న విద్యార్థులకు వ్యాసరచన పోటీ

17 Jul, 2016 21:36 IST|Sakshi
అనంతపురం ఎడ్యుకేషన్‌ : వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. 19న పాఠశాల స్థాయి, 20న మండలస్థాయి,  21న జిల్లాస్థాయిలో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.  
 
‘చెట్లు – మానవ సర్వతోముఖాభివృద్ధి కారకాలు’ అనే అంశంపై పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు.  22న గ్రామ, మండలస్థాయిలో వనమహోత్సవ చైతన్య ర్యాలీలు నిర్వహించేలా ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
 
మరిన్ని వార్తలు