దొంగబాబా అరెస్టు

27 Aug, 2015 22:17 IST|Sakshi

ఎమ్మిగనూరు(కర్నూలు): పూజల పేరుతో ప్రజల్ని మోసగిస్తున్న ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురువారం చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న హసన్ అలీ అలియాస్ తాజుద్దీన్ క్షుద్ర పూజలతో స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. అయితే ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ దొంగ బాబాను అరెస్టు చేసి విచారణ చేశారు.

దీంతో అతడు పలు హత్య కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం దొంగ బాబా పులివెందుల పోలీసుల అదుపులో ఉన్నాడు. పులివెందులలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు