అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

27 Aug, 2015 22:13 IST|Sakshi

గుంటూరు: ఓ రైస్ మిల్లులో భారీగా నిల్వ ఉంచిన అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట - వినుకొండ రోడ్డులోని ఓ రైస్ మిల్లులో అక్రమ రేషన్ బియ్యం ఉన్నట్టు సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆర్డీవోకు సమాచారం అందించారు. వెంటనే ఆర్డీవో పోలీసులతో కలిసి ఆ రైస్ మిల్లు వద్దకు చేరుకున్నారు. ఆ రైస్ మిల్లు తాళాలు పగుటకొట్టించి.. రెండు వేలకు పైగా అక్రమ రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు