కర్నూలు సిటీ: జిల్లాలోని ప్రతి స్కూల్, కాలేజీలో ఫీజు చెల్లింపులు ఆన్లైన్లో జరగాలని..ఇందుకు ఈపోస్ మిషన్లు ఇస్తామని కలెక్టర్ విజయమోహన్ తెలిపారు. సోమవారం స్థానిక సునయన ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు నగదు రహిత లావాదేవీలపై అవగహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం నరసింహారావు, డీఈఓ రవీంద్రనాథ్రెడ్డి, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి.జనార్దన్రెడ్డి, పుల్లయ్యలు, ప్రైవేటు స్కూళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.