ఫోరెన్సిక్ ల్యాబ్కు నయీమ్ ఆయుధాలు

4 Sep, 2016 02:06 IST|Sakshi
ఫోరెన్సిక్ ల్యాబ్కు నయీమ్ ఆయుధాలు

షాద్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఉపయోగించిన ఆయుధాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు. నయీమ్ ఎన్‌కౌంటర్ తరువాత అతను ఉపయోగించిన ఆయుధాలు ఏకే 47, మూడు రివాల్వర్లు, ఇతర మందుగుండు సామగ్రిని అదేరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఏకే 47, 3 రివాల్వర్లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు తెలి సింది. శనివారం షాద్‌నగర్ మెజిస్ట్రేట్ సీఎచ్‌ఎన్ మూర్తి సమక్షంలో ఆయుధాల ను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపించారు. సంఘటన స్థలంలో లభించిన బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని కూడా తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు