కర్నూలు(న్యూసిటీ) సంకల్బాగ్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో సా్వమివారి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసస్వామి వార్లకు వేదపండితుల అభిషేకం చేసి పట్టువస్త్రాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. తర్వాత శేషవాహనంపై శ్రీనివాసస్వామి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు జగన్మోహనశర్మ, నగర బ్రాహ్మణ సంఘం అ«ధ్యక్షుడు కె. చంద్రశేఖరశర్మ, ప్రధానకార్యదర్శి సీవీ దుర్గాప్రసాద్, బ్రాహ్మణ వేల్ఫెర్ అసోసియేషన్ జిల్లా కోఆర్టినేటర్ సముద్రాల హానుమంతరావు, గౌరవాధ్యక్షుడు కేవీ సూబ్బారావు పాల్గొన్నారు.