మంగళగిరి: మంగళగిరిలో వేంచేసిఉన్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని శుక్రవారం కర్నాటక హోకోర్టు జడ్జి వేణుగోపాల్ దంపతులు దర్శించుకున్నారు. ఎగువ, దిగువ సన్నిధులలో స్వామివారిని దర్శించుకున్న ఆయనకుS ఆలయ పాలకవర్గ సభ్యులు, ఈవో పానకాలరావు ఆలయమర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్జి వేణుగోపాల్ దంపతులకు ఈవో మండెపూడి పానకాలరావు నృసింహుని చిత్రపటాన్ని బహుకరించారు.