లైన్‌మెన్‌ రాజగోపాల్‌ సస్పెన్షన్‌

6 Jan, 2017 00:12 IST|Sakshi
లేపాక్షి : లేపాక్షిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో జూనియర్‌ లైన్‌మన్‌గా పని చేసే రాజగోపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు హిందూపురం ట్రాన్స్‌కో డివిజనల్‌ డీఈఈ ఆర్‌ఎన్‌ శేషగిరిరావు గురువారం తెలిపారు. రాజగోపాల్‌ తన రెండో భార్య మంజులను హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో అతన్ని సస్పెండ్‌ చేసినట్లు వివరించారు.
మరిన్ని వార్తలు