మంత్రాలయం రైల్వేలైన్‌కు రీసర్వే

24 May, 2017 21:32 IST|Sakshi
మంత్రాలయం రైల్వేలైన్‌కు రీసర్వే
 ఎంపీ బుట్టా రేణుక అభ్యర్థనను అంగీకరించిన రైల్వే అధికారులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నుంచి మంత్రాలయం రైల్వేలైన్‌ పనులకు రీసర్వే చేపట్టాలంటూ ఎంపీ బుట్టా రేణుక చేసిన అభ్యర్థనపై  రైల్వే శాఖ అధికారులు స్పందించారు. బుధవారం ఎంపీ దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌యాదవ్‌ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. కర్నూలు–మంత్రాలయం రైల్వేలైన్‌ రీసర్వే పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం.. ఎంపీకి హామీ ఇచ్చారు. అలాగే డోన్‌ పట్టణంలోని 150, 166 రైల్వే గేట్లను ప్రజల సౌకర్యార్థం యథావిధిగా కొనసాగించాలనే అభ్యర్థనపై జీఎం సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థన మేరకు బెంగుళూరు–యశ్వంత్‌పుర రైలును మద్దికెర రైల్వే స్టేషన్‌లో ఆపే సదుపాయం కల్పించనున్నట్లు జీఎం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎంపీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన వెలువడింది.
 
మరిన్ని వార్తలు