భీమవరం (ప్రకాశం చౌక్) : పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ దర్శనం కోసం శుక్రవారం భక్తులు భారీగా తరిలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు చీరలు, జాకెట్ ముక్కలు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన గరిషే రవీందర్, మంజులా దంపతులు 60 గ్రాముల 800 మిల్లీ గ్రాముల (రాళ్ల, పూసలతో సహా )బంగారం హారం బహుకరించారు. ఆలయ ఈవో నల్ల సూర్యచక్రధరరావు దాతలను అభినందించారు. ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. అలాగే అమ్మవారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శంచుకున్నారు.