నీళ్లనుకుని యాసిడ్ తాగిన ఎంటెక్ విద్యార్థిని

24 Jun, 2016 23:43 IST|Sakshi
నీళ్లనుకుని యాసిడ్ తాగిన ఎంటెక్ విద్యార్థిని
  • ఎంటెక్ విద్యార్థిని మృతి
  • జనగామ: కళాశాలకు వెళ్లే తొందరలో నీళ్లుగా భావించి యాసిడ్ తాగిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. వరంగల్ జిల్లా జనగామలోని వీవర్స్ కాలనీకి చెందిన మాచర్ల సారిక(23) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఎంటెక్ చదువుతోంది. ప్రతిరోజూ హైదరాబాద్ వెళ్లి వచ్చే ఆమె ఈనెల 20న కళాశాలకు వెళ్లే తొందరలో పట్టు వస్త్రాలు శుభ్రం చేసేందుకు వినియోగించే యూసిడ్‌ను తాగునీరని భావించి తాగింది. అస్వస్థతకు గురైన ఆమెను ఏరియా ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సారిక మృతి చెందింది.

మరిన్ని వార్తలు