-
3 వేల మంది పోలీసుల మోహరింపు
-
కోనసీమ చేరుకుంటున్న అదనపు బలగాలు
-
పది రోజులపాటు కోనసీమ ఖాకీవనం
అమలాపురం :
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కోనసీమలో చేపట్టనున్న సత్యాగ్రహ పాదయాత్ర తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదంటూ ఓ పక్క చెబుతూ నే.. మ రో పక్క భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా యాత్రను అడ్డుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాపులను బీసీల్లో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో ఈ నెల 16 నుంచి 21 వరకూ ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్న విషయం తెలి సిందే. జిల్లా పోలీసు యంత్రాంగం తుని విధ్వంసం నేపథ్యంలో ఎటువంటి అంవాఛనీయ సంఘటనలు జరకుండా భారీగా పోలీసులను మోహరిస్తోంది.
కీలక ప్రాంతాల్లో పోలీసుల హడావుడి
ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా సాధారణ పోలీసులనే కాకుండా ప్రత్యేక పోలీసులు, ఆర్మ్డ్ ఫోర్సు, ఏఎ¯ŒSఎస్లకు చెందిన సుమారు 3 వేల మందిని కోనసీమకు రప్పించారు. రాజకీయ పార్టీలు, వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు పాదయాత్రలు చేయడం, ఆ సమయంలో పోలీసు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం సర్వసాధారణమే గానీ, ఈసారి ఏకంగా మూడు వేల బలగాలను దింపడం ఇదే తొలిసారి. వీరు పది రోజుల పాటు కోనసీమలోనే ఉండనున్నారు. ఖా కీల రాక ప్రారంభం కావడంతో అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం వంటి కీలక ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల వద్ద వారి హడావుడి మొదలైంది. కాపు ఉద్యమపరంగా కోనసీమ సున్నిత ప్రాంతం కావడంతో యాత్ర జరిగే ప్రాంతాల్లోనే కాకుండా మొత్తం కోనసీమలోని అన్ని ప్రాం తాల్లోనూ అదనపు బలగాలను వినియోగిస్తున్నారు. కోనసీమతో పాటు ముద్రగడ సొంత ప్రాంతం కిర్లం పూడి, కాపు ఉద్యమ నేతలు చురుగ్గా ఉన్న ప్రాంతాల్లో పోలీసుల తాకిడి ఎక్కువగా ఉండనుంది.
ఉద్యమకారులపై నిఘా
తుని ఘటనను దృష్టిలో పెట్టుకుని ఉద్యమకారులపై పోలీసుల నిఘా మరింత పెరిగింది. నాటి ఘటనలో నిందితులుగా ఉన్నవారిపై ఇప్పటికే ఒక కన్నేసిన పోలీసులు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారిపై స్టేషన్ల వారీగా ఆరా తీస్తున్నారు. పాదయాత్ర ప్రారంభమయ్యే రావులపాలెం పోలీస్ స్టేష¯ŒSకు 1,600 మంది సిబ్బందిని కేటాయించగా, ఇప్పటికే 302 మంది చేరుకున్నాంటే మోహరింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదివారం ఏలూరు రేంజ్ డీఐజీ పీవీ రామకృష్ణ , జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్, అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్య తదితర పోలీస్ ఉన్నతాధికారులు రావులపాలెం పోలీస్స్టేçÙ¯ŒSలో పరిస్థితిని సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత ప్రాంతం కావడంతో అమలాపురంలో పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరిస్తున్నారు. ఎక్కడికక్కడ మోహరింపే కాకుండా పాదయాత్ర రూట్ పొడవునా బందోబస్తు ఎక్కువగా ఉంచనున్నారు. రూట్ మ్యాప్ పరిశీలించిన పోలీసులు ఆయా గ్రామాల్లోని నాలుగు రోడ్ల కూడళ్లలో బందోబస్తు పెంచేందుకు నిర్ణయించారు. ఎంపిక చేసిన ముఖ్యకూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాదయాత్రకు వెనుక, ముందు మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. బలగాలతోపాటు ఆందోళనకారులను చెదరగొట్టే వాటర్క్యా¯ŒS వాహనాన్ని సైతం సిద్ధం చేశారు. దీన్ని అనంతపురం నుంచి రావులపాలానికి ప్రత్యేకంగా రప్పించారు.
కోర్టులో పిటిష¯ŒS
కాపు ఉద్యమకారుల పాదయాత్ర వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున దీన్ని నిలుపుదల చేయాలంటూ రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది మేడా శ్రీనివాసరావు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. యాత్ర వల్ల వర్గవైషమ్యాలు తలెత్తుతాయి కాబట్టి యాత్రను అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఇదే సమయంలో పోలీసులు సైతం పాదయాత్రకు తమ నుంచి అనుమతి తీసుకోలేదని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు స్పందన ఎలా ఉంటుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.